అన‌వ‌స‌రంగా బ‌య‌టికి వస్తే రామనామం రాయాల్సిందే!

ABN , First Publish Date - 2021-05-17T22:26:12+05:30 IST

ప్రస్తుతం దేశంలో కరోనా ఉద్ధృతి తీవ్రంగా ఉన్న నేపథ్యంలో పలు రాష్ట్రాలు నైట్ క‌ర్ఫ్యూలు, లాక్‌డౌన్‌లు అమ‌లు చేస్తున్నాయి.

అన‌వ‌స‌రంగా బ‌య‌టికి వస్తే రామనామం రాయాల్సిందే!

ప్రస్తుతం దేశంలో కరోనా ఉద్ధృతి తీవ్రంగా ఉన్న నేపథ్యంలో పలు రాష్ట్రాలు  నైట్ క‌ర్ఫ్యూలు, లాక్‌డౌన్‌లు అమ‌లు చేస్తున్నాయి. అనుమతించిన సమయాల్లోనే బయటకు రావాల్సిందిగా ప్రజలకు సూచిస్తున్నాయి. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలకు దిగుతున్నాయి. అయినా నిత్యం ఎంతో మంది నిబంధ‌న‌లు ఉల్లంఘిస్తూనే ఉన్నారు. 


ఈ నేపథ్యంలో ఉల్లంఘనులకు పోలీసులు వినూత్న శిక్షలు విధిస్తున్నారు. కప్పగంతులు వేయించడం, రోడ్లు శుభ్రం చేయించడం, గుంజీలు తీయించడం వంటివి చేయిస్తున్నారు. మధ్యప్రదేశ్‌లోని సాత్నా జిల్లాలో నిబంధనలు ఉల్లంఘించిన వారి చేత అక్క‌డి పోలీసులు `రామనామం` రాయిస్తున్నారు. నిబంధనలు అతిక్రమించి రోడ్ల మీదకు వచ్చిన వారికి ఒక డెయిరీ ఇచ్చి అరగంట పాటు `రామ.. రామ` అని రాయ‌మంటున్నారు.

Updated Date - 2021-05-17T22:26:12+05:30 IST