మతం మారారని అంబేద్కర్‌పై కేసు వేస్తారా?: కాంగ్రెస్ నేత

ABN , First Publish Date - 2021-12-14T00:31:25+05:30 IST

బలంవంతంగా మతం ఎవరూ మారడం లేదు. మతం మారడంలో తప్పేం లేదు. నిన్నటి వరకు ముస్లింగా ఉన్న రిజ్వీ ఈరోజు త్యాగిగా మారారు. ఆయనపైకి ఇప్పుడు దాడికి వెళ్లమంటారా? బాబాసాహేబ్ అంబేద్కర్ బౌద్ధ మతాన్ని తీసుకున్నారు..

మతం మారారని అంబేద్కర్‌పై కేసు వేస్తారా?: కాంగ్రెస్ నేత

బెంగళూరు: మత మారారని బాబాసాహేబ్ అంబేద్కర్‌పై కేసు పెడతారా అంటూ కర్ణాటక కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ సీఎం ఇబ్రహీం విమర్శించారు. మత మార్పిడి నిరోధక బిల్లును వ్యతిరేకిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మతం మారడమనేది ఎక్కడా బలవంతంగా జరగడం లేదని, అది కొందరు సృష్టిస్తున్న తప్పుడు ప్రచారమని ఆయన కొట్టి పారేశారు. భారతీయ జనతా పార్టీ టార్గెట్‌గా విమర్శలతో విరుచుకుపడ్డారు.


‘‘బలంవంతంగా మతం ఎవరూ మారడం లేదు. మతం మారడంలో తప్పేం లేదు. నిన్నటి వరకు ముస్లింగా ఉన్న రిజ్వీ ఈరోజు త్యాగిగా మారారు. ఆయనపైకి ఇప్పుడు దాడికి వెళ్లమంటారా? బాబాసాహేబ్ అంబేద్కర్ బౌద్ధ మతాన్ని తీసుకున్నారు. ఆయనపై కేసు నమోదు చేస్తారా? వసుధైక కుటుంబం, సర్వమత సౌభ్రాతృత్వం అని లెక్చర్లు ఇస్తూనే మత మార్పిడిలంటూ గొడవలు సృష్టిస్తున్నారు’’ అని సీఎం ఇబ్రహీం అన్నారు.

Updated Date - 2021-12-14T00:31:25+05:30 IST