ఉత్తమ్పద్మావతిరెడ్డి కోలుకోవాలని పూజలు
ABN , First Publish Date - 2022-01-25T05:57:13+05:30 IST
కోదాడ మాజీ ఎమ్మెల్యే నలమాద ఉత్తమ్పద్మావతిరెడ్డి కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని మండలంలోని పెదవీడు శివాలయంలో షేక్కరీం ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నేతలు సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు.
మఠంపల్లి, జనవరి 24: కోదాడ మాజీ ఎమ్మెల్యే నలమాద ఉత్తమ్పద్మావతిరెడ్డి కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని మండలంలోని పెదవీడు శివాలయంలో షేక్కరీం ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నేతలు సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో డీసీసీ ప్రధాన కార్యదర్శి ఎంఎం యాదవ్, సాముల వెంకటేశ్వరరెడ్డి, గాయం అదిరెడ్డి, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు తెల్లబాటి శ్రీనివాస్, బూరసోములు, సీతరాములు, సుంకరశ్రావణ్ పాల్గొన్నారు.
మందకృష్ణమాదిగ కోలుకోవాలని...
ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మంద కృష్ణమాదిగ కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని మండల కేంద్రంలోని హోసన్నా మినిస్ర్టీస్ ప్రార్థనా మందిరంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మండల కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కార్యక్రమంలో ఫాస్టర్ పాల్, ఇరుగుప్రభు, ఎల్లయ్య, నాగబాబు, కుర్రిశ్రీను, వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.