కార్మికులను వెంటనే ఉద్యోగాల్లోకి తీసుకోవాలి

ABN , First Publish Date - 2021-06-24T05:26:24+05:30 IST

కార్మికులను వెంటనే ఉద్యోగాల్లోకి తీసుకోవాలి

కార్మికులను వెంటనే ఉద్యోగాల్లోకి తీసుకోవాలి
సాగర్‌ రహదారిపై భిక్షాటన చేస్తున్న సీఐటీయూ నాయకులు, టాటా కంపెనీ ఉద్యోగులు

ఇబ్రహీంపట్నం : ఆదిభట్ల టాటా అడ్వాన్స్‌ కంపెనీల్లో నుంచి తొలగించిన కార్మికులను వెంటనే ఉద్యోగాల్లోకి తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ బుధవారం సీఐటీయూ ఆధ్వర్యంలో సాగర్‌ రహదారిపై భిక్షాటన చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు కాడిగళ్ల భాస్కర్‌ మాట్లాడుతూ.. టాటా గ్రూపు లోకానికి దాతృత్వం చాటుతూ, సొంత కార్మికులపట్ల దుర్మార్గంగా వ్యవహరిస్తుందని అన్నారు. హక్కుల కోసం ప్రశ్నిస్తే వందమంది కార్మికులను పనుల నుంచి తొలగించడం ఎంతవరకు సమంజసమని అన్నారు. కార్యక్రమంలో కేవీపీఎస్‌ జిల్లా కార్యదర్శి సామెల్‌, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు జగదీష్‌, మండల కన్వీనర్‌ రాములు, టౌన్‌ కన్వీనర్‌ ఎల్లేష్‌, నాయకులు యాదగిరి, శంకర్‌, జంగయ్య, చరణ్‌, జగన్‌తోపాటు కార్మికులు పాల్గొన్నారు.

Updated Date - 2021-06-24T05:26:24+05:30 IST