6వ రోజుకు చేరుకున్న కార్మికుల రిలే నిరాహారదీక్షలు

ABN , First Publish Date - 2022-07-03T05:23:33+05:30 IST

కడప కార్పొరేషన ఎదుట మున్సిపల్‌ కార్మికులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 6వ రోజుకి చేరుకున్నాయి.

6వ రోజుకు చేరుకున్న కార్మికుల రిలే నిరాహారదీక్షలు

కడప(సెవెనరోడ్స్‌), జూలై 2: కడప కార్పొరేషన ఎదుట మున్సిపల్‌ కార్మికులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 6వ రోజుకి చేరుకున్నాయి. యూనియన నేత రమాదేవి చేదీక్ష లు ప్రారంభించా రు. ఈ సందర్భంగా రమాదేవి మాట్లాడుతూ ఐఏఎస్‌ లాంటి ఉన్నత స్థాయి అధికారి కమిషనర్‌గా వచ్చారని, కార్మికులకు ఏదైనా మేలు జరుగుతుంది అని ఆశపడ్డామన్నారు. కానీ ఈ కమిషనర్‌ కార్మికులకు పని దొంగలు అన్నట్లుగా రూల్స్‌ పెడుతున్నారన్నారు. సుంకర రవి అధ్యక్షత వహించారు. విజయభాస్కర్‌, తిరుపాల్‌, గోపి, ఆదాము, ఎస్‌.కేశవ, సాయమ్మ, ప్రసాద్‌, మరియు కార్మికులు హాజరయ్యారు. 

Updated Date - 2022-07-03T05:23:33+05:30 IST