కార్మికులు భద్రతా నియమాలు పాటించాలి
ABN , First Publish Date - 2022-06-29T05:27:44+05:30 IST
పరిశ్రమల్లో పనిచేసే కార్మికు లు తప్పక భద్రతా నియమాలు పాటించాలని పరిశ్రమల డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి పేర్కొన్నారు.
మైలవరం, జూన్ 28: పరిశ్రమల్లో పనిచేసే కార్మికు లు తప్పక భద్రతా నియమాలు పాటించాలని పరిశ్రమల డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి పేర్కొన్నారు. మంగళవారం దాల్మియా పరిశ్రమలో కార్మికుల భద్రత, ఆరోగ్య సూత్రాలపై హెడ్ కరుణాకర్రావు ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్బంగా డీసీఐఎఫ్ కృష్ణమూర్తి మాట్లాడుతూ కార్మికులు పరిశ్రమల్లో పనిచేసే సమయంలో సెఫ్టీ బెల్ట్, గ్లౌస్, తలకు టోపి తప్పక ధరించాలని, వృత్తి పరమైన వ్యాధులు సంభవించకుండా ఆరోగ్య సూత్రాలు పాటించాలని తెలిపారు. దాల్మియా హెడ్ కరుణాకర్ రావు పని ప్రదేశంలో పాటించాల్సిన భద్రత, ప్రమాదాలను నివారించడంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరించారు. కార్యక్రమంలో అధికారులు డాక్టర్ పీవీ రావు, విద్యాసాగర్, దాల్మి యా పీఆర్ఓ కృష్ణారెడ్డి, అధికారులు, కార్మికులు పాల్గొన్నారు.