Mla Koneru Konappa: సమన్వయంతో పనిచేయాలి
ABN , First Publish Date - 2022-09-29T03:32:10+05:30 IST
అధి కారులు, ప్రజాప్రతి నిధులు సమన్వ యంతో పనిచేసి మండలాభివృద్ధికి కృషిచేయాలని ఎమ్మెల్యే కోనేరుకోనప్ప అన్నారు. బుధవారం మండల కేంద్రం లోని రైతువేదికలో ఎంపీపీ సుజాత అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గిరిజన గ్రామాలకు అటవీఅనుమతులు రాగానే పనులు ప్రారంభిస్తామన్నారు.
- మండల సర్వసభ్య సమావేశం
పెంచికలపేట, సెప్టెంబరు 28: అధికారులు, ప్రజాప్రతి నిధులు సమన్వ యంతో పనిచేసి మండలాభివృద్ధికి కృషిచేయాలని ఎమ్మెల్యే కోనేరుకోనప్ప అన్నారు. బుధవారం మండల కేంద్రం లోని రైతువేదికలో ఎంపీపీ సుజాత అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గిరిజన గ్రామాలకు అటవీఅనుమతులు రాగానే పనులు ప్రారంభిస్తామన్నారు. కొండపల్లిలో ఇటీవల కురిసిన భారీవర్షాలకు కూలిన వంతెనపై కొందరు అసత్య ఆరోపణలు చేయడం సరికాదన్నారు. అనంతరం మండలంలోని చెడ్వాయి, బొంబాయిగూడ, ఎల్కపల్లిలో ఎమ్మెల్యే బతుకమ్మచీరలు, కల్యాణలక్ష్మిచెక్కులను పంపిణీ చేశారు. ఎంపీడీవో గంగాసింగ్, జడ్పీటీసీ సరిత, మార్కెట్కమిటీచైర్మన్ శ్రీనివాస్, తహసీల్దార్ అంతరాజు పాల్గొన్నారు.