Konaseema Dist.: పరామర్శకు వచ్చిన ఎమ్మెల్యేను అడ్డుకున్న స్థానికులు

ABN , First Publish Date - 2022-07-24T20:19:12+05:30 IST

పరామర్శించడానికి వచ్చిన ఎమ్మెల్యే చిట్టిబాబును పెద్దపట్నం లంక వద్ద వరద బాధితులు అడ్డుకున్నారు.

Konaseema Dist.: పరామర్శకు వచ్చిన ఎమ్మెల్యేను అడ్డుకున్న స్థానికులు

కోనసీమ జిల్లా (Konaseema Dist.): పెద్దపట్నం లంక వద్ద వరద బాధితులను పరామర్శించడానికి వెళ్లిన ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు (Chittibabu)ను స్థానికులు అడ్డుకున్నారు. కనీస వసతులు కూడా కల్పించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అసలు తమకు ఏం చేశారని పరామర్శకు వచ్చారని ఎమ్మెల్యేపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఎమ్మెల్యేను నిలదీస్తారా? అంటూ చిట్టిబాబు అనుచరులు మండిపడ్డారు.


కాగా గోదావరి వరద (Godavari Flood) ఉధృతి క్రమేపి తగ్గు ముఖం పట్టింది. అయితే కోనసీమ జిల్లాలోని అనేక లంక గ్రామాలు ఇంకా వరద నీటిలోనే ఉన్నాయి. మామిడి కుదురు మండలం, పెదపట్నం లంక ఇంకా వరద ముంపులోనే చిక్కుకున్నాయి. దీంతో వరద బాధితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తినడానికి తిండి లేక తాగడానికి తాగునీరు లేక వరద బాధితులు (Flood Victms) ఆకలి కేకలు వేస్తున్నారు.

Updated Date - 2022-07-24T20:19:12+05:30 IST