పోలీస్స్టేషన్ ముందు మహిళ ఆత్మహత్యాయత్నం
ABN , First Publish Date - 2021-08-08T21:15:18+05:30 IST
కరీంనగర్: కరీంనగర్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ ముందు ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని రేకుర్తికి చెందిన దివ్య ఆదివారం టూ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట శానిటైజర్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.
కరీంనగర్: కరీంనగర్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని రేకుర్తికి చెందిన దివ్య ఆదివారం టూ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట శానిటైజర్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. తన భర్త తనకు తెలియకుండా ముందే వివాహం చేసుకున్నాడని ఆవేదన వక్తం చేసింది. పెద్ద మనుషుల సమక్షంలో మాట్లాడుకుందామని పిలిచి తమ వారిపై కేసు పెట్టించారని ఆరోపించింది. తనకు న్యాయం చేయాలని పోలీసులను వేడుకుంది. కేసు దర్యాప్తులో ఉంది.