ఆరోగ్యంపై మహిళలు ప్రత్యేక శ్రద్ధ వహించాలి

ABN , First Publish Date - 2022-05-29T06:09:00+05:30 IST

మహిళలు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్‌ పమేలాసత్పథి సూచించారు. శనివారం భువనగిరి మునిసిపల్‌ కార్యాలయంలో మెప్మా ఆధ్వర్యంలో మహిళా సంఘాల సభ్యులకు నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు.

ఆరోగ్యంపై మహిళలు ప్రత్యేక శ్రద్ధ వహించాలి
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ పమేలాసత్పథి

కలెక్టర్‌ పమేలాసత్పథి 

భువనగిరి టౌన్‌, మే 28: మహిళలు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్‌ పమేలాసత్పథి సూచించారు. శనివారం భువనగిరి మునిసిపల్‌ కార్యాలయంలో మెప్మా ఆధ్వర్యంలో మహిళా సంఘాల సభ్యులకు నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. మహిళలు వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు ఆరోగ్యంపై జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అలాగే మహిళల సమస్యలపై ఆమె చర్చించి పలు సూచనలు చేశారు. మహిళా సిబ్బందికి వైద్యపరీక్షలు నిర్వహించారు. సమావేశంలో జిల్లా వైద్యాధికారి మల్లిఖార్జున్‌రావు, జిల్లా సంక్షేమ అధికారి కృష్ణవేణి, మునిసిపల్‌ కమిషనర్‌, బి నాగిరెడ్డి పాల్గొన్నారు.   


Updated Date - 2022-05-29T06:09:00+05:30 IST