మహిళలు అన్నిరంగాల్లో రాణించాలి

ABN , First Publish Date - 2021-01-25T04:57:26+05:30 IST

మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని ఎస్సై ఏ.రాములు, వైస్‌ చైర్‌పర్సన్‌ అఖిల రాజశేఖర్‌రెడ్డి అన్నారు.

మహిళలు అన్నిరంగాల్లో రాణించాలి

మక్తల్‌, జనవరి 24 : మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని ఎస్సై ఏ.రాములు, వైస్‌ చైర్‌పర్సన్‌ అఖిల రాజశేఖర్‌రెడ్డి అన్నారు. ఆదివారం పట్టణంలోని మినీ స్టేడియంలో జా తీయ బాలికల దినోత్సవాన్ని పుర స్కరించుకొని ఏకలవ్యస్పోర్ట్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో బాలబాలికలకు ఆటల పోటీలు నిర్వహించారు. ఈ సంద ర్భంగా వారు మాట్లాడుతూ  చదు వుతోపాటు క్రీడల్లో రాణిస్తే మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. పోటీలు నిర్వహించిన ఏకలవ్య స్పోర్ట్స్‌క్లబ్‌ అధ్యక్షుడు, రిటైర్డ్‌ పీఈటీ బి.గోపాలంను వారు అభినందించారు. కార్యక్రమంలో పీఈటీలు అంబ్రేష్‌, అంబిక, రఘు, బాబు, కురుమయ్య, విజయక్రిష్ణ, బాలబాలికలు పాల్గొన్నారు. 

Updated Date - 2021-01-25T04:57:26+05:30 IST