రైలు నుంచి జారి పడి మహిళ మృతి

ABN , First Publish Date - 2021-10-20T04:40:12+05:30 IST

కాచిగూడ నుంచి మంగళూరుకు వెళుతున్న రైలు నుంచి మంగళవారం సాయంత్రం నాగేంద్రమ్మ(28) జారి పడి మృతి చెందింది.

రైలు నుంచి జారి పడి మహిళ మృతి
నాగేంద్రమ్మ మృతదేహం

నందలూరు, అక్టోబరు19: కాచిగూడ నుంచి మంగళూరుకు వెళుతున్న రైలు నుంచి మంగళవారం సాయంత్రం నాగేంద్రమ్మ(28) జారి పడి మృతి చెందింది. వివరాల్లోకెళితే గుత్తి దగ్గర బత్తెపల్లె తండా వాసి నాగేంద్రమ్మ భర్త భీమ్లానాయక్‌తో కలిసి గుత్తి నుంచి రాజంపేట కు వస్తున్నారు. నందలూరు స్టేషన్‌లో రైలు నెమ్మదిగా వెళుతుండగా రైలు దిగేందుకు ప్రయత్నించి జారి అదే రైలు కింద పడింది. ఈ సంఘటనలో తొడ తెగిపడిపోవడం తో తీవ్రంగా రక్తస్రావమైంది. వెంటనే స్టేషన్‌ సిబ్బంది ఇచ్చిన సమాచారంపై వచ్చిన 108 సిబ్బంది మహిళను పరిశీలించి అప్పటికే ఆమె మృతి చెందిందన్నారు. కేసు నమోదు చేసినట్లు ఆర్‌పీఎఫ్‌ ఎస్‌ఐ శంకర్‌ నాయక్‌ తెలిపారు. 


Updated Date - 2021-10-20T04:40:12+05:30 IST