మున్సిపల్ అధికారిని చెప్పుతో కొట్టిన మహిళ
ABN , First Publish Date - 2021-07-31T22:25:10+05:30 IST
ఫోన్లో అసభ్యంగా మాట్లాడుతూ వేధించిన ఓ అధికారిని మహిళతో పాటు కుటుంబసభ్యులు దేహశుద్ధి చేశారు. ఆలస్యంగా వెలుగులోకి
సంగారెడ్డి: ఫోన్లో అసభ్యంగా మాట్లాడుతూ వేధించిన ఓ అధికారిని మహిళతో పాటు కుటుంబసభ్యులు దేహశుద్ధి చేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో జరిగింది. సంగీత అనే మహిళ ఇల్లు కూలిపోయింది. కొత్త ఇంటిని నిర్మించుకునేందుకు అనుమతి కోసం సదాశివపేట మున్సిపల్ ఆఫీసుకు వెళ్లింది. సంగీత ఫోన్ నెంబర్ తీసుకున్న శానిటరి ఇన్స్పెక్టర్ వెంకన్న ఆమెతో అసభ్యంగా మాట్లాడి వేధించాడు. ఈ వ్యవహాన్ని సంగీత భర్తకు చెప్పింది. దీంతో ఆమె భర్త, ఇతర కుటుంబసభ్యులు మున్సిపల్ కార్యాలయానికి వచ్చి వెంకన్నకు దేహశుద్ధి చేశారు. ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశారు.