భూవివాదంలో మహిళకు తీవ్రగాయాలు

ABN , First Publish Date - 2022-08-19T06:24:08+05:30 IST

భూవివాదంలో మహిళకు తీవ్ర గాయా లయ్యాయి. ఈ ఘటన మండలంలోని చౌటపల్లి గ్రామంలో గురువారం చోటుచేసుకుంది.

భూవివాదంలో మహిళకు తీవ్రగాయాలు

మఠంపల్లి, ఆగస్టు 18: భూవివాదంలో మహిళకు తీవ్ర గాయా లయ్యాయి.  ఈ ఘటన మండలంలోని చౌటపల్లి గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. స్థానికులు,  బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. చౌటపల్లి గ్రామానికి చెందిన అమెరబోయిన అక్కమ్మకు  సొంత పొలంలో వ్యవసాయ పనులు చేయడానికి గురువారం ఉదయం వెళ్లింది. ‘మీ పొలంలో నీళ్లు మా పొలంలోకి వస్తున్నాయి.. కావాలనే మళ్లిసు ్తన్నారు.’ అంటూ పక్క పొలం రైతు చిలికేశ్వరపు శ్రీను  అక్కమ్మతో గొడవ పడ్డాడు. మాటా మాటా పెరగడంతో శ్రీను తన  చేతిలో  ఉన్న పారతో ఒక్కసారిగా అక్కమ్మపై దాడి చేసాడు. దీంతో అక్కమ్మ తల పగిలి తీవ్రంగా రక్తస్రావమై  సొమ్మసిల్లి పడిపోయింది.  చుట్టుపక్కల రైతులు అక్కమ్మను చికిత్స నిమ్తితం హుజూర్‌నగర్‌ ఆస్పత్రికి తరలిం చారు. పాత కక్షలు, రాజకీయ కక్షతోనే శ్రీను అక్కమ్మపై దాడి చేశారని ఆమె బంధువులు తెలిపారు. ఈ మేరకు అక్కమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మఠంపల్లి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 


Updated Date - 2022-08-19T06:24:08+05:30 IST