లాక్ డౌన్ కష్టాలు: పిల్లాడిని ఎత్తుకుని, 12 కిలోమీటర్లు నడిచి....
ABN , First Publish Date - 2020-04-05T13:18:43+05:30 IST
ఈ దృశ్యం ఛత్తీస్ గఢ్ లోని సమేలీ-అరన్పూర్ రహదారిలో అనారోగ్యంతో ఉన్న పిల్లవాడిని తీసుకువెళుతున్న మహిళలకు సంబంధించినది. లాక్డౌన్ కారణంగా బస్సులు నిలిపివేసారు. ఈ ప్రాంతంలో....
నకుల్నార్: ఈ దృశ్యం ఛత్తీస్ గఢ్ లోని సమేలీ-అరన్పూర్ రహదారిలో అనారోగ్యంతో ఉన్న పిల్లవాడిని తీసుకువెళుతున్న మహిళలకు సంబంధించినది. లాక్డౌన్ కారణంగా బస్సులు నిలిపివేసారు. ఈ ప్రాంతంలో అంబులెన్సులు కూడా అందుబాటులో లేవు. సమేలీ-అరన్పూర్ రహదారిపై మహిళలు ఇద్దరు పిల్లలను తీసుకుని మండుటెండలో ఆసుపత్రికి తీసుకు వచ్చారు. ఆ చిన్నారులు అనారోగ్యం బారిన పడ్డారు. 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న ట్రెక్కా గ్రామం నుండి కాలినడకన వారు ఆసుపత్రికి చేరుకున్నారు. అరన్పూర్ నుంచి వచ్చే బస్సులన్నీ బంద్ అయ్యాయని జోగి అనే మహిళ తెలిపారు. కాగా నెల రోజుల నుంచి అంబులెన్స్ డ్రైవర్ లేడని సమేలీ పిహెచ్సికి చెందిన రమీ అతీక్ అన్సారీ తెలిపారు. రెండేళ్ల క్రితం పిహెచ్సికి అంబులెన్స్ ఇచ్చారన్నారు. పై అధికారులతో మాట్లాడి అంబులెన్సుకు డ్రైవర్ను ఏర్పాటు చేస్తామని సిఎంహెచ్ఓ డాక్టర్ ఎస్పీ శాండిల్య తెలిపారు.