టిప్పర్‌ ఢీకొని మహిళ మృతి

ABN , First Publish Date - 2021-10-20T06:32:51+05:30 IST

మండలంలోని కైరేవు గ్రామం వద్ద మంగళవారం టిప్పర్‌ ఢీ కొని అదే గ్రామానికి చెందిన అమీద (36) మృతి చెందింది

టిప్పర్‌ ఢీకొని మహిళ మృతి

శెట్టూరు, అక్టోబరు19: మండలంలోని కైరేవు గ్రామం వద్ద మంగళవారం టిప్పర్‌ ఢీ కొని అదే గ్రామానికి చెందిన అమీద (36) మృతి చెందింది. స్థానికులు తెలిపిన వివరా లివి. అమీద కూలీ పనులు చేసుకుని జీవనం సాగించేది. ఇందులో భాగంగానే కూలీ పను లు ముగించుకుని శెట్టూరు నుంచి కైరేవుకు తిరిగి వస్తుండగా టిప్పర్‌ ఢీకొని అక్కడికక్కడే మృతి చెందింది. టిప్పర్‌ అతివేగంగా రావడంతోనే ప్రమాదం జరిగిందని తోటి కూలీలు తె లిపారు. మృతురాలికి భర్త అబ్దుల్లా, కుమారు డు, కుమార్తె ఉన్నారు. పోలీసులు ఘటనా స్థ లాన్ని పరిశీలించి, కేసు దర్యాప్తు చేస్తున్నారు.


Updated Date - 2021-10-20T06:32:51+05:30 IST