ట్రాఫిక్ చలానా కింద మంగళసూత్రాన్నిచ్చిన మహిళ

ABN , First Publish Date - 2021-02-27T23:29:15+05:30 IST

ట్రాఫిక్ చలానా కింద మంగళసూత్రాన్నిచ్చిన మహిళ

ట్రాఫిక్ చలానా కింద మంగళసూత్రాన్నిచ్చిన మహిళ

బెంగళూరు: కర్ణాటక రాష్ట్రంలో ఓ విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. ట్రాఫిక్ పోలీసులకు ఓ మహిళ తన మంగళసూత్రాన్ని జరిమానా కింద ఇవ్వడం సంచలనం సృష్టించింది. ట్రాఫిక్ ఉల్లంఘనకు జరిమానా చెల్లించడానికి డబ్బు లేకపోవడంతో కర్ణాటకలో 30 ఏళ్ల మహిళ ట్రాఫిక్ పోలీసులకు తన మంగళసూత్రాన్ని ఇచ్చింది.


ఈ దంపతులు ఇద్దరు సిటీ మార్కెట్‌లో మంచం కొనుగోలు చేసేందుకు రూ.1800 తమ వెంట తీసుకెళ్లారు. మార్కెట్‌లో రూ. 1700 విలువైన మంచాన్ని వారు కొనుగోలు చేశారు.


ఈ ఘటనపై ఆమె మాట్లాడుతూ.. అల్పాహారం కోసం తమ దగ్గరున్న చివరి రూ. 100 కూడా ఖర్చు చేశామని, అయినా పోలీసులు పట్టుబట్టారని వాపోయారు. చివరికి చేసేది లేక.. తన దగ్గరున్న మంగళసూత్రాన్ని వారికిచ్చినట్టు తెలిపారు. దీనిపై పోలీసులు ఇప్పటి వరకు స్పందించ లేదు. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  

Updated Date - 2021-02-27T23:29:15+05:30 IST