కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇంట్లో మహిళ ఆత్మహత్య

ABN , First Publish Date - 2021-05-17T23:16:35+05:30 IST

ఇదే విషయమై స్థానిక ఎస్పీ రాజేష్ సింగ్ భదోరియా మాట్లాడుతూ ‘‘ఎమ్మెల్యే బంగళాలో ఒక సర్వెంట్, అతడి భార్య ఉంటారు. ఆదివారం ఉదయం సర్వెంట్ భార్య డోర్ కొట్టగా ఎలాంటి స్పందన రాలేదు

కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇంట్లో మహిళ ఆత్మహత్య

భోపాల్: మధ్యప్రదేశ్‌కి చెందిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బంగళాలో ఒక మహిళ (38) ఆత్మహత్య చేసుకున్నారు. ఆ మహిళ సదరు ఎమ్మెల్యేకు సన్నిహితురాలు కావడం, పైగా ఆమె రాసిన సూసైడ్ నోట్‌లో ఎమ్మెల్యేను ప్రస్తావించడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. రాష్ట్రంలోని గాంధ్వాని అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఉమాంగ్ సింగార్ బంగళాలో ఆదివారం జరిగిందీ ఘటన.


ఆత్మహత్య చేసుకున్న మహిళ వద్ద నుంచి పోలీసులు ఓ లేఖను స్వాధీనం చేసుకున్నారు. ఈ లేఖలో ఎమ్మెల్యే సింగార్ జీవితంలో స్థానాన్ని కోర్టుకున్నట్లు, అయితే అది సాధ్యం కాదనే దు:ఖంలో ఇక ఎంత మాత్రమూ బతకడం ఇష్టం లేక ప్రాణం తీసుకుంటున్నట్లు లేఖలో మహిళ రాసుకొచ్చినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ విషయమై ఎమ్మెల్యే ఉమాంగ్ స్పందిస్తూ ‘‘ఆమె నాకు మంచి మిత్రురాలు. ఈ సంఘటన తెలిసి నా హృదయం పగిలిపోయింది. నేను మూడు రోజులుగా నా అసెంబ్లీ నుంచి దూరంగా ఉన్నాను’’ అని పేర్కొన్నారు.


ఇదే విషయమై స్థానిక ఎస్పీ రాజేష్ సింగ్ భదోరియా మాట్లాడుతూ ‘‘ఎమ్మెల్యే బంగళాలో ఒక సర్వెంట్, అతడి భార్య ఉంటారు. ఆదివారం ఉదయం సర్వెంట్ భార్య డోర్ కొట్టగా ఎలాంటి స్పందన రాలేదు. ఈ విషయాన్ని ఎమ్మెల్యే సింగార్‌తో పాటు వారి బంధువులకు సర్వెంట్ గణేష్ తెలియజేశాడు. వారు వచ్చి చూడగా ఆమె ఫ్యాన్‌కు ఉరి వేసుకుని కనిపించింది’’ అని చెప్పారు.

Updated Date - 2021-05-17T23:16:35+05:30 IST