చెరువులో పడి మహిళ మృతి
ABN , First Publish Date - 2021-06-20T05:33:35+05:30 IST
సదాశివపేటలోని పుబ్బ చెరువులో మహిళ ప్రమాదవశాత్తు జారిపడి మృతి చెందింది.
సదాశివపేట, జూన్ 19 : సదాశివపేటలోని పుబ్బ చెరువులో మహిళ ప్రమాదవశాత్తు జారిపడి మృతి చెందింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మహిళను సదాశివపేటకు చెందిన సుగుణ (50)గా గుర్తించారు. చెరువులో నుంచి మృతదేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. మృతురాలి కు టుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.