స్టార్ హోటల్.. 8వ అంతస్తులోని ఓ బాత్రూంను శుభ్రం చేసేందుకు వెళ్లిన సిబ్బంది.. డస్ట్బిన్లో చూస్తే..
ABN , First Publish Date - 2022-06-01T17:27:01+05:30 IST
ఒక మహిళ మాతృత్వానికే మాయని మచ్చగా నిలిచింది.. క్రూర మృగాల కంటే దారుణంగా ప్రవర్తించింది..
ఒక మహిళ మాతృత్వానికే మాయని మచ్చగా నిలిచింది.. క్రూర మృగాల కంటే దారుణంగా ప్రవర్తించింది.. భర్త, అత్తింటి వారితో జరిగిన గొడవలను మనసులో పెట్టుకుని అభం శుభం తెలియని పసికందును ఘోరంగా శిక్షించింది.. అప్పుడే పుట్టిన బిడ్డను డస్ట్బిన్లో పడేసి వెళ్లిపోయింది.. గదులను శుభ్రం చేయడానికి వెళ్లిన హౌస్ కీపింగ్ సిబ్బందికి బిడ్డ ఏడుపు వినిపించింది.. టాయ్లెట్ డస్ట్బిన్లో పడి ఉన్న నవజాత శిశువును వారు కాపాడి హాస్పిటల్కు తరలించారు.. పోలీసులకు సమాచారం అందించారు.. ముంబైలో ఈ దారుణం జరిగింది.
ఇది కూడా చదవండి..
నా భర్తకు లోపం ఉంది.. నన్ను దగ్గరకు కూడా రానివ్వడం లేదు.. పోలీసులకు ఓ మహిళ ఫిర్యాదు!
నెలలు నిండిన 41 ఏళ్ల మహిళ భర్తతో గొడవ పడి ముంబైలోని ఓ ఫైవ్స్టార్ హోటల్కు వెళ్లింది. అక్కడే నొప్పులు రావడంతో టాయ్లెట్లో ఓ మగ శిశువుకు జన్మనిచ్చింది. పేగు తెంచుకుని పుట్టిన కొడుకు గుక్కపట్టి ఏడుస్తున్నా పట్టించుకోకుండా ఆ చిన్నారిని తల్లి అక్కడే ఉన్న డస్ట్బిన్లో పడేసి వెళ్లిపోయింది. కాసేపటికి గదిని శుభ్రం చేయడానికి హౌస్ కీపింగ్ సిబ్బంది వెళ్లగా వారికి టాయ్లెట్ నుంచి బిడ్డ ఏడుపు వినిపించింది. టాయ్లెట్ డస్ట్బిన్లో ఉన్న నవజాత శిశువును వారు వెంటనే ఆస్పత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు.
ప్రస్తుతం చిన్నారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. సీసీటీవీ పుటేజ్ ఆధారంగా మహిళను పోలీసులు గుర్తించినట్లు సమాచారం. సదరు మహిళ ఒక సాప్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగి అని, కేవలం భర్త, అత్తింటివారితో గొడవ కారణంగా మహిళ ఇంతటి దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.