మహిళ మృతి

ABN , First Publish Date - 2021-01-27T06:20:36+05:30 IST

మండలంలోని నగరూరు గ్రామానికి చెందిన చంద్రమ్మ (36) అనే మహిళ శనగ మిషన్‌లో పడి మృతి చెందినట్లు ఎస్‌ఐ గిరిబాబు తెలిపారు.

మహిళ మృతి


ఆస్పరి, జనవరి 26: మండలంలోని నగరూరు గ్రామానికి చెందిన చంద్రమ్మ (36) అనే మహిళ శనగ మిషన్‌లో పడి మృతి చెందినట్లు ఎస్‌ఐ గిరిబాబు తెలిపారు. మంగళవారం కౌలుకు తీసుకున్న పదెకరాల శనగ పొలంలో నూర్పిడి యంత్రంలోకి శనగ కట్టె వేస్తుండగా ప్రమాదానికి గురై మృతి చెందిందని తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. 

Updated Date - 2021-01-27T06:20:36+05:30 IST