ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ

ABN , First Publish Date - 2021-03-04T05:25:46+05:30 IST

పురపోరులో భాగంగా బుధవారం నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది.

ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ

ఆత్మకూరు, మార్చి 3 : పురపోరులో భాగంగా బుధవారం నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. మున్సిపల్‌లో మొత్తం 23 వార్డులు ఉండగా 114 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఈ రెండురోజుల్లో 54 మంది ఉపసంహరించు కున్నారు. ఆరు వార్డులు ఏకగ్రీవమైనట్లు అధికారులు ప్రకటించారు. దాంతో మిగిలిన 17 వార్డుల్లో ఎన్నికలు జరగనున్నాయి. 52 మంది బరిలో ఉన్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థులు బీ-ఫారం అందజేయడంతో పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితాను సైతం అధికారులు వెల్లడించారు. ఏకగ్రీవమైన వార్డులలో 4వ వార్డులో కోడూరు కౌసల్యమ్మ, 5వ వార్డులో షేక్‌ మహబూబ్‌బాషా, 6వ వార్డులో నోటి విజయజ్యోతి, 9వ వార్డులో కొప్పోలు రమాదేవి, 10వ వార్డులో తుమ్మల త్రివేణి, 21వ వార్డు లో డాక్టర్‌ శ్రావణ్‌కుమార్‌ ఉన్నారు. ఇక ఎన్నికలు జరగనున్న 17 వార్డులలో వైసీపీ 17 వార్డులు, టీడీపీ 13, జీజేపీ 5, సీపీఐ 2, సీపీఎం 4, జనసేన 2, బీఎస్పీ 3, స్వతంత్ర అభ్యర్థులు 6 వార్డుల్లో పోటీలో ఉన్నారు.  దాంతో గురువారం నుంచి ప్రచారం ఊపందుకోనుంది. 

Updated Date - 2021-03-04T05:25:46+05:30 IST