కారు ఢీకొని వృద్ధుడి దుర్మరణం
ABN , First Publish Date - 2021-01-27T05:04:56+05:30 IST
దొరవారిసత్రంలో మంగళవారం రహదారి దాటుతుండగా కారు ఢీకొనడంతో గవండ్ల కృష్ణయ్య (70) అనే వృద్ధుడు దుర్మరణం చెందాడు.
దొరవారిసత్రం, జనవరి 26 : దొరవారిసత్రంలో మంగళవారం రహదారి దాటుతుండగా కారు ఢీకొనడంతో గవండ్ల కృష్ణయ్య (70) అనే వృద్ధుడు దుర్మరణం చెందాడు. స్థానికులు వెంటపడే ప్రయత్నం చేసినా కారు ప్రమాదస్థలం నుంచి వెళ్లిపోవడంతో దాని ఆచూకీ లభ్యంకాలేదు. పోలీసులు వృద్ధుడి మృతదేహాన్ని నాయుడుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కారు ఆచూకీ కోసం విచారణ జరుపుతున్నారు.