గెలుపోటములను స్ఫూర్తిగా తీసుకోవాలి
ABN , First Publish Date - 2021-01-27T05:55:33+05:30 IST
గెలుపోటములను స్ఫూర్తిగా తీసుకోవాలి
చేవెళ్ల: క్రీడాకారులు గెలుపోటములను స్ఫూర్తిగా తీసుకోవాలని టీఆర్ఎస్ రాష్ట్ర యువ నాయకులు పి.కార్తీక్రెడ్డి అన్నారు. చేవెళ్ల మండల వైస్ఎంపీపీ కర్నె శివప్రసాద్ తన తండ్రి కర్నె శ్రీశైలం జ్ఞాప కార్థం ఉరెళ్లలో గత 15రోజులు నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ మంగళవారం ముగిసింది. ఈ కార్యక్రమానికి కార్తీక్రెడ్డితో పాటు జిల్లా డీజీఎంఎస్ చైర్మన్ పి.కృష్ణారెడ్డి, చేవెళ్ల ఎంపీపీ ఎం.విజయలక్ష్మీలు హాజరై క్రీడల్లో గెలుపొందిన లంగరహౌస్ జట్టుకు రూ.14వేల నగదు, షీల్డ్ అందజేశారు. అదేవిధంగా రన్నర్ ఉరెళ్ల యూత్ జట్టుకు రూ.5వేలు నగదుతో పాటు, షీల్డ్ను అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల సర్పంచుల సంఘం మాజీ అధ్యక్షుడు వెంకటేశంగుప్తా, సర్పంచ్ జహంగీర్, విఠలయ్య, రవికాంత్రెడ్డి, యాదిరెడ్డి, ప్రభాకర్, ఆంజనేయులు, శివకుమార్ గుప్తా, అలీ, నాగుల్రెడ్డి, బుగ్గయ్య, అబ్దుల్ ఘని, నర్సింలు, వెంకటేశ్, కుమార్, గాంధీ, రమేశ్, చోటు, శ్రీనివాస్, చాన్పాష ఉన్నారు.