గెలుపోటములను స్ఫూర్తిగా తీసుకోవాలి

ABN , First Publish Date - 2021-01-27T05:55:33+05:30 IST

గెలుపోటములను స్ఫూర్తిగా తీసుకోవాలి

గెలుపోటములను స్ఫూర్తిగా తీసుకోవాలి

చేవెళ్ల: క్రీడాకారులు గెలుపోటములను స్ఫూర్తిగా తీసుకోవాలని టీఆర్‌ఎస్‌ రాష్ట్ర యువ నాయకులు పి.కార్తీక్‌రెడ్డి అన్నారు. చేవెళ్ల మండల వైస్‌ఎంపీపీ కర్నె శివప్రసాద్‌ తన తండ్రి కర్నె శ్రీశైలం జ్ఞాప కార్థం ఉరెళ్లలో గత 15రోజులు నిర్వహించిన క్రికెట్‌ టోర్నమెంట్‌ మంగళవారం ముగిసింది. ఈ కార్యక్రమానికి కార్తీక్‌రెడ్డితో పాటు జిల్లా డీజీఎంఎస్‌ చైర్మన్‌ పి.కృష్ణారెడ్డి, చేవెళ్ల ఎంపీపీ ఎం.విజయలక్ష్మీలు హాజరై క్రీడల్లో గెలుపొందిన లంగరహౌస్‌ జట్టుకు రూ.14వేల నగదు, షీల్డ్‌ అందజేశారు. అదేవిధంగా రన్నర్‌ ఉరెళ్ల యూత్‌ జట్టుకు రూ.5వేలు నగదుతో పాటు, షీల్డ్‌ను అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల సర్పంచుల సంఘం మాజీ అధ్యక్షుడు వెంకటేశంగుప్తా, సర్పంచ్‌ జహంగీర్‌, విఠలయ్య, రవికాంత్‌రెడ్డి, యాదిరెడ్డి, ప్రభాకర్‌, ఆంజనేయులు, శివకుమార్‌ గుప్తా, అలీ, నాగుల్‌రెడ్డి, బుగ్గయ్య, అబ్దుల్‌ ఘని, నర్సింలు, వెంకటేశ్‌, కుమార్‌, గాంధీ, రమేశ్‌, చోటు, శ్రీనివాస్‌, చాన్‌పాష ఉన్నారు. 

Updated Date - 2021-01-27T05:55:33+05:30 IST