కూరగాయల ధరలకు రెక్కలు

ABN , First Publish Date - 2021-06-18T05:21:29+05:30 IST

వారం క్రితం వరకు కూరగాయలకు ధర లేక సాగుదారులు అల్లాడారు. ఇక రెండు రోజుల నుంచి రేట్లు అమాంతం పెరగడంతో కొనుగోలుదారులు జంకుతున్నారు.

కూరగాయల ధరలకు రెక్కలు

నారాయణఖేడ్‌,జూన్‌ 17: వారం క్రితం వరకు కూరగాయలకు ధర లేక సాగుదారులు అల్లాడారు. ఇక రెండు రోజుల నుంచి రేట్లు అమాంతం పెరగడంతో కొనుగోలుదారులు  జంకుతున్నారు. వారం క్రితం కిలో పచ్చిమిర్చి రూ.30 నుంచి 40 వరకు ఉంటే గురువారం కిలో రూ.80చొప్పున విక్రయించారు. కిలో టమాట రూ.15 నుంచి అమాంతం రూ.30కి పెరిగింది. బీరకాయలు, చిన్న చిక్కుడు, క్యాప్సికం, వంకాయ, దొండకాయ, బెండకాయలు కిలో రూ.40 ఉండేవి. ప్రస్తుతం కిలో రూ.60 నుంచి 80 వరకు విక్రయిస్తున్నారు. కొత్తిమీర కరివేపాకు ధరలు కూడా పెరిగాయి. వర్షాలు కురుస్తుంటే ధరలు అమాంతం పెంచడం ఏంటని కొనుగోలుదారులు ఆందోళనచెందుతున్నారు. వ్యాపారులు మాత్రం వర్షాల వల్ల పంటలు దెబ్బతిన్నాయని, వినియోగదారుల సౌలభ్యం కోసం దూరప్రాంతాల నుంచి తెచ్చి విక్రయిస్తున్నామని చెబుతున్నారు. 

Updated Date - 2021-06-18T05:21:29+05:30 IST