రూ.1.3 కోట్ల మద్యం ధ్వంసం
ABN , First Publish Date - 2022-07-02T06:22:32+05:30 IST
చిత్తూరు పోలీసు సబ్ డివిజన్ పరిధిలో పోలీసులు సీజ్ చేసిన రూ.కోటి 36 లక్షల విలువ గల మద్యాన్ని శుక్రవారం ఎక్సైజ్ పోలీసులు ధ్వంసం చేశారు.
తవణంపల్లె, జూలై 1: చిత్తూరు పోలీసు సబ్ డివిజన్ పరిధిలో పోలీసులు సీజ్ చేసిన రూ.కోటి 36 లక్షల విలువ గల మద్యాన్ని శుక్రవారం ఎక్సైజ్ పోలీసులు ధ్వంసం చేశారు. సబ్ డివిజన్ పరిధిలోని 17 పోలీస్స్టేషన్లలో 2020-21 సంవత్సరంలో అక్రమంగా తరలిస్తుండగా సీజ్ చేసిన మద్యాన్ని పోలీసులు, ఎక్త్సెజ్ అధికారులు సంయుక్తంగా మండలంలోని కాణిపాక పట్నంకు తరలించి రోడ్ రోలర్తో ధ్వంసం చేశారు. ఎస్పీ రిషాంత్రెడ్డి, ఏఎస్పీ జగదీష్, చిత్తూరు డీఎస్పీ సుధాకర్రెడ్డి, వెస్ట్ సీఐ శ్రీనివాసులురెడ్డి, సబ్ డివిజన్ పరిధిలోని ఎస్ఐలు పాల్గొన్నారు.