‘ధర్నాను జయప్రదం చేయండి’
ABN , First Publish Date - 2022-05-24T06:30:27+05:30 IST
అధిక ధరలను నిరసిస్తూ వామపక్షపార్టీల ఆధ్వర్యంలో ఈనెల 30న కలెక్టరేట్ ఎదుట జరిగే ధర్నాను జయప్రదం చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి బి.గిడ్డయ్య పిలుపునిచ్చారు.
కర్నూలు(న్యూసిటీ), మే 23: అధిక ధరలను నిరసిస్తూ వామపక్షపార్టీల ఆధ్వర్యంలో ఈనెల 30న కలెక్టరేట్ ఎదుట జరిగే ధర్నాను జయప్రదం చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి బి.గిడ్డయ్య పిలుపునిచ్చారు. సోమవారం వామపక్ష నాయకులతో కలిసి సీపీఐ కార్యాలయంలో ధర్నా పోస్టర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా గిడ్డయ్య మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యా్స, వంట నూనె ధరలను తగ్గించాలని, విద్యుత్, బస్ చార్జీలు, ఆస్తి, నీటి పన్ను భారాలను అదుపు చేయాలని డిమాండ్ చేశారు. పెరుగుతున్న ధరలకు వ్యతిరేకంగా ఈనెఅల 25, 26 తేదీల్లో పెట్రోలు బంకుల వద్ద కరపత్రాల పంపిణీ, 28న ప్రధాన కూడళ్లలో ప్రచారం, 30న కలెక్టరేట్ల వద్ద ధర్నా నిర్వహిస్తున్నామన్నారు. సీపీఎం జిల్లా నాయకులు నారాయణ, సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు నరసింహులు, ఏఐకేఎంఎస్ నాయకులు వెంకటస్వామి పాల్గొన్నారు.