ఆలయ అభివృద్ధికి కృషి చేస్తా

ABN , First Publish Date - 2022-07-02T06:25:08+05:30 IST

కనకమహాలక్ష్మి దేవస్థానం అభివృద్ధికి, భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తానని ఈఓ కె.శిరీష తెలిపారు. తొలుత అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆమె పూర్వపు ఈఓ కె.శాంతి నుంచి బాధ్యతలు స్వీకరించారు.

ఆలయ అభివృద్ధికి కృషి చేస్తా
శిరీషను సన్మానిస్తున్న పాలకమండలి సభ్యులు

కనకమహాలక్ష్మి ఈఓ కె.శిరీష

విశాఖపట్నం, జులై 1 (ఆంధ్రజ్యోతి): కనకమహాలక్ష్మి దేవస్థానం అభివృద్ధికి, భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తానని  ఈఓ కె.శిరీష తెలిపారు. తొలుత అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆమె పూర్వపు ఈఓ కె.శాంతి నుంచి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పాలకవర్గ సభ్యులు ఆమెను అభినందించగా, అందరి సూచనలు, సలహాలతో ముందుకు వెళతానని స్పష్టంచేశారు. అంతకు ముందు జిల్లా అసిస్టెంట్‌ కమిషనర్‌ కార్యాలయంలోను శాంతి నుంచి బాధ్యతలు తీసుకున్నారు. జిల్లాలో ఈఓలు, దేవాలయాల సిబ్బందితో కలిసి ఆలయాల అభివృద్ధికి, ఆదాయం పెంపునకు ప్రయత్నిస్తానని చెప్పారు.


Updated Date - 2022-07-02T06:25:08+05:30 IST