ఖజానాశాఖ ఉద్యోగులకు జీతాలెప్పుడిస్తారో..?

ABN , First Publish Date - 2021-03-08T05:02:45+05:30 IST

జిల్లా ఖజానాశాఖ ఉద్యోగులకు మాత్రం ఫిబ్రవరి నెల జీతాలు ఆదివారం వరకు అందలేదు.

ఖజానాశాఖ ఉద్యోగులకు జీతాలెప్పుడిస్తారో..?

చిత్తూరు కలెక్టరేట్‌, మార్చి 7: అన్ని ప్రభుత్వ శాఖల్లో పనిచేసే ఉద్యోగులకు జీతాలిచ్చేది జిల్లా ఖజానాశాఖ. ఆశాఖ ద్వారానే జిల్లాలోని 108 ప్రభుత్వ శాఖల ఉద్యోగులకు ప్రతినెల ఒకటో తేదీన వారి బ్యాంకు ఖాతాల్లో వేతనాలు జమవుతున్నాయి. అయితే జిల్లా ఖజానాశాఖ ఉద్యోగులకు మాత్రం ఫిబ్రవరి నెల జీతాలు ఆదివారం వరకు అందలేదు. జిల్లా ఖజానాశాఖ కార్యాలయంలో సుమారు 75 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరికి సంబంధించి ఫిబ్రవరి 28న సీఎఫ్‌ఎంఎస్‌ ద్వారా వేతనాల బిల్లులు పంపారు. అయితే మార్చి నెల వారం రోజులు గడిచినా ఎందుకు జీతాలు రాలేదో తెలియడం లేదని ఉద్యోగులు వాపోతున్నారు.

Updated Date - 2021-03-08T05:02:45+05:30 IST