వైఫై వినియోగానికి నెలకు రూ.75
ABN , First Publish Date - 2021-12-21T16:11:10+05:30 IST
దక్షిణ రైల్వేలో ఉచితంగా ఇస్తున్న వైఫైను 30 నిముషాలకు పైగా వినియోగించుకొనేందుకు నెలకు రూ.75 ఛార్జీ చెల్లించాలని అధికారులు తెలిపారు. దక్షిణ రైల్వే పరిధిలో 543 రైల్వేస్టేషన్లలో స్పీడ్ వైఫై సౌకర్యం
- రైల్వే శాఖ
ఐసిఎఫ్(చెన్నై): దక్షిణ రైల్వేలో ఉచితంగా ఇస్తున్న వైఫైను 30 నిముషాలకు పైగా వినియోగించుకొనేందుకు నెలకు రూ.75 ఛార్జీ చెల్లించాలని అధికారులు తెలిపారు. దక్షిణ రైల్వే పరిధిలో 543 రైల్వేస్టేషన్లలో స్పీడ్ వైఫై సౌకర్యం కల్పించారు. చెన్నై డివిజన్లో 135 రైల్వేస్టేషన్లలో ఈ సేవలను ప్రయాణికులు 30 నిముషాలు ఉచితంగా వినియోగించుకోవచ్చు. ఆపైన వినియోగించుకోవాలంటే రోజుకు రూ.10 (5 జీబీ వరకు) వంతున 30 రోజులకు రూ.75 (60 జీబీ) రుసుము చెల్లించాలని అధికారులు తెలిపారు.