భార్యను హతమార్చిన భర్త అరెస్టు
ABN , First Publish Date - 2021-01-27T04:40:59+05:30 IST
భార్యను క్రికెట్ బ్యాట్తో కొట్టి హత్య చేసిన కేసులో భర్త బత్తుల పోలయ్యను మంగళవారం అరెస్టు చేశారు.
అద్దంకి, జనవరి 26 : భార్యను క్రికెట్ బ్యాట్తో కొట్టి హత్య చేసిన కేసులో భర్త బత్తుల పోలయ్యను మంగళవారం అరెస్టు చేశారు. స్థానిక పోలీ్సస్టేషన్లో మంగళవారం రాత్రి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దర్శి డీఎస్పీ ప్రకా్షరావు ఆ వివరాలు వెల్లడించారు. మండలంలోని ధర్మవరానికి చెందిన బత్తుల పోలయ్య, రుక్మిణమ్మకు 33 ఏళ్ల క్రితం వివాహమైంది. వారికి ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. భార్యకు వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో పోలయ్య తరచూ ఇంట్లో గొడవ పడుతుండేవాడు. గత ఏడాది డిసెంబరు 16న భార్య రుక్మిణమ్మ బజారులో ఎవరితోనే మాట్లాడడం పోలయ్య చూశాడు. అదేరోజు క్రికెట్ బ్యాట్తో భార్య తలపై కొట్టాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. పెద్ద కుమారుడు రమే్షబాబు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పోలయ్యను మంగళవారం సీఐ ఆంజనేయరెడ్డి అరెస్టు చేశారు. సమావేశంలో ఎస్ఐ మహేష్ ఉన్నారు.