అనారోగ్యంతో భార్య మృతి... జీర్ణించుకోలేక భర్త ఆత్మహత్య
ABN , First Publish Date - 2022-01-28T01:49:48+05:30 IST
అనారోగ్యంతో భార్య మృతి... జీర్ణించుకోలేక భర్త ఆత్మహత్య
బెంగళూరు: అనారోగ్యంతో బాధపడుతున్న భార్య మృతి చెందడాన్ని జీర్ణించుకోలేక భర్త ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బెంగళూరు గ్రామీణ జిల్లా దేవనహళ్ళి తాలూకా బూదిగెరె గ్రామానికి చెందిన లావణ్యతో విజయేంద్రకు 9 ఏళ్లక్రితం వివాహం జరిగింది. వీరికి సంతానం లేదు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న లావణ్య (32) గురువారం ఉదయం ఇంట్లో మృతి చెందారు. భార్య మృతిని జీర్ణించుకోలేని భర్త విజయేంద్ర (38) ఇంట్లో ఉరివేసుకున్నాడు. దీనిపై చెన్నరాయపట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.