రోడ్డు ప్రమాదంలో భార్య మృతి
ABN , First Publish Date - 2022-08-15T05:53:37+05:30 IST
రోడ్డు ప్రమాదంలో భార్య మృతి చెందగా భర్తకు తీ వ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదం మండలకేంద్రం కేతేపల్లిలో 65వ నెంబర్ జాతీయ రహదారిపై ఆదివారం జరిగిం ది.
భర్తకు తీవ్ర గాయాలు
కేతేపల్లి, ఆగస్టు 14: రోడ్డు ప్రమాదంలో భార్య మృతి చెందగా భర్తకు తీ వ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదం మండలకేంద్రం కేతేపల్లిలో 65వ నెంబర్ జాతీయ రహదారిపై ఆదివారం జరిగిం ది. పోలీసులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం... నకిరేకల్ పట్టణంలో ని శాంతినగర్కు చెందిన కోల నాగరాజు తన భార్య పరమేశ్వరి(39)తో కలిసి అత్తగారి గ్రామమైన సూర్యాపేట మండలం టే కుమట్ల గ్రామంలో జరుగుతున్న ముత్యాలమ్మ పండగకు టీవీఎస్ మోపెడ్పై వెళ్తున్నారు. మండలకేంద్రం కేతేపల్లిలోని ఎస్సీ కాలనీ సమీపంలో వెనుక నుంచి వస్తున్న ఇన్నోవా వాహనం బలంగా ఢీకొట్టింది. దీంతో మోపెడ్ దూరంగా పడిపోగా దానిపై ఉన్న భార్యాభర్తలు నాగరాజు, పరమేశ్వరి ఎగిరిపడ్డారు. ప్రమాదంలో తీవ్రంగా గా యపడిన పరమేశ్వరి అక్కడికక్కడే మృతి చెందగా నాగరాజుకు తీవ్ర గాయాలయ్యా యి. సమాచారం అందుకున్న పోలీసులు, జీఎమ్మార్ సిబ్బంది గాయపడిన నాగరాజును చికిత్స నిమిత్తం నకిరేకల్ ప్రభుత్వ ఆసుపత్రికి అక్కడ నుంచి నల్లగొండ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతురాలికి కుమార్తె, కుమారుడు ఉన్నా రు. పరమేశ్వరి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నకిరేకల్ ప్రభుత్వ ఆస్పత్రికి త రలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ అనిల్రెడ్డి వివరించారు. ప్రమాదానికి కారణమైన ఇన్నోవా వాహనాన్ని స్టేషనకు తరలించినట్లు పోలీసులు తెలిపారు.