మాసయ్య హత్యపై భార్య ఫిర్యాదు
ABN , First Publish Date - 2020-08-03T11:23:09+05:30 IST
శనివారం రాత్రి దారుణ హత్యకు గురైన మా సయ్య భార్య బంగారమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శ్రీనివాసులు
తిమ్మాజిపేట, ఆగస్టు 2: శనివారం రాత్రి దారుణ హత్యకు గురైన మా సయ్య భార్య బంగారమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శ్రీనివాసులు తెలిపారు. మండలంలోని ఆవంచ గ్రామానికి చెం దిన బచ్చలకూర మాసయ్య అనే వ్యక్తి శనివారం రాత్రి గ్రామంలోని దర్గా వద్ద హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలను డీఎస్పీ మోహన్రెడ్డి, ఇన్చార్జి సీఐ వెంకట్రెడ్డి సేకరించారు. అదే గ్రామానికి చెందిన మన్యమయ్య, అర్జున్, ప్రశాంత్ అనే వ్యక్తులు తన భర్తను హత్య చేశారని మృతుడి భార్య ఫిర్యాదు చేసిందన్నారు. గ్రామంలో పాతకక్షల కారణం గా మాసయ్య హత్యకు గురైనట్లు పోలీసులు తెలిపారు. విచారణ చేస్తున్నామని, త్వరలోనే నిందితులను పట్టుకుంటామని ఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు.