కరోనాపై పాక్ మతాధికారి వింత వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2020-06-14T17:59:52+05:30 IST

కరోనా వైరస్‌పై పాకిస్థాన్ దేశానికి చెందిన ఓ మతాధికారి చేసిన వింత వ్యాఖ్యలు సంచలనం రేపాయి....

కరోనాపై పాక్ మతాధికారి వింత వ్యాఖ్యలు

‘‘మనం నిద్రపోతున్నపుడు..కరోనా వైరస్ కూడా నిద్రపోతోంది’’  

ఇస్లామాబాద్ (పాకిస్థాన్): కరోనా వైరస్‌పై పాకిస్థాన్ దేశానికి చెందిన ఓ మతాధికారి చేసిన వింత వ్యాఖ్యలు సంచలనం రేపాయి.కరోనా వైరస్ రాకుండా ఉండాలంటే ప్రజలు ఎక్కువగా నిద్రపోవాలని పాక్ మతాధికారి చెప్పిన వీడియో క్లిప్ వైరల్ అయింది.‘‘మా వైద్యులు ఎల్లప్పుడూ ఎక్కువ నిద్రపోవాలని మాకు సిఫార్సు చేశారు. మనం ఎంత ఎక్కువ నిద్రపోతున్నామో అంత కరోనా వైరస్ నిద్రపోతోంది. ఈ వైరస్ మాకు హాని చేయదు. మేము నిద్రపోతున్నప్పుడు అది నిద్రిస్తోంది, మనం మరణించినప్పుడు అది చనిపోతుంది’’అని వీడియో క్లిప్‌లో పాక్ మతాధికారి చెప్పారు. పాక్ మతాధికారి చేసిన వ్యాఖ్యల వీడియో ఫుటేజీని జర్నలిస్టు నైనా ఇనాయత్ ట్విట్టర్ లో పోస్టు చేశారు. పాక్ మతాధికారి వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో పలు వ్యాఖ్యలు వెల్లువెత్తాయి. పాకిస్థాన్ దేశంలో కరోనా కేసుల సంఖ్య 1,35, 702కు పెరిగాయి. 

Updated Date - 2020-06-14T17:59:52+05:30 IST