భార్యను తీసుకొచ్చేందుకు వెళ్లిన భర్త.. ఆమె రాను అనడంతో ఎంత పని చేశాడంటే..
ABN , First Publish Date - 2022-04-23T19:35:29+05:30 IST
అతనికి మూడేళ్ల క్రితం వివాహం జరిగింది.. అతనికి మద్యం సేవించే అలవాటు ఉంది..
అతనికి మూడేళ్ల క్రితం వివాహం జరిగింది.. అతనికి మద్యం సేవించే అలవాటు ఉంది.. తరచుగా మద్యం సేవించి ఇంటికి వెళ్లి భార్యను ఇబ్బంది పెట్టేవాడు.. ఆమెతో తరచుగా గొడవపడే వాడు.. భర్తతో వేగలేకపోయిన భార్య ఏడాది క్రితం పుట్టింటికి వెళ్లిపోయింది.. భర్త ఎన్నిసార్లు పిలిచినా రాలేదు.. భార్యను రమ్మని గురువారం మరోసారి పిలిచాడు.. అయినా ఆమె రాలేదు. దీంతో ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు.
రాజస్థాన్లోని పాలికి సమీపంలోని గిరద్దా గ్రామానికి చెందిన శేషారామ్ నాయక్ అనే వ్యక్తి మూడేళ్ల కిందట వివాహం చేసుకున్నాడు. రోజు కూలీగా పని చేసే నాయక్ మద్యం సేవించి ఇంటికి వెళ్లేవాడు. భార్యతో గొడవపడి ఆమెను కొట్టేవాడు. భర్త ప్రవర్తనతో విసిగిపోయిన మహిళ ఏడాది క్రితం పుట్టింటికి వెళ్లిపోయింది. నాయక్ ఎంత బతిమాలినా తిరిగి అత్తింటికి వెళ్లలేదు. దీంతో ఆమెను బతిమాలి తిరిగా కాపురానికి తీసుకెళ్లేందుకు నాయక్ గురువారం ఆమె దగ్గరకు వెళ్లాడు.
తనతో పాటు రమ్మని భార్యను బతిమాలాడు. ఆమె మాత్రం నాయక్తో తిరిగి వెళ్లేందుకు అంగీకరించలేదు. దీంతో నాయక్ ఒక్కడే బైక్పై బయల్దేరాడు. మార్గమధ్యంలో మద్యం సేవించాడు. అనంతరం మద్యం మత్తులో ఓ చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు నాయక్ మృతదేహాన్ని పోస్ట్మార్టమ్కు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు చేస్తున్నారు.