భర్తపై అలిగి పుట్టింటికి వెళ్లిన భార్య.. ఆమెను పిలుచుకురావడానికి వెళ్లి.. మద్యం మత్తులో భర్త చేసిన పని..

ABN , First Publish Date - 2021-12-29T00:45:18+05:30 IST

చెన్నైలో భర్తపై అలిగిన భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. భార్యను తీసుకొచ్చేందుకు వెళ్లిన భర్త.. మద్యం మత్తులో అక్కడ చేసిన పనికి, అంతా షాక్ అయ్యారు. వివరాల్లోకి వెళితే...

భర్తపై అలిగి పుట్టింటికి వెళ్లిన భార్య.. ఆమెను పిలుచుకురావడానికి వెళ్లి.. మద్యం మత్తులో భర్త చేసిన పని..

పచ్చని కాపురాల్లో మద్యం అలవాటు ఒక్కోసారి చిచ్చు పెడుతూ ఉంటుంది. మద్యం మత్తులో చిన్న చిన్న సమస్యలను పెద్దవి చేస్తూ ఉంటారు. ఆ ఆవేశంలో ఏం చేస్తున్నారో వారికే తెలీనంతలా ప్రవర్తిస్తుంటారు. చివరకు సంసారాలను సర్వనాశనం చేసుకుంటూ ఉంటారు. అప్పటి వరకూ బాగున్న వారు.. మద్యం తీసుకోగానే సైకోల్లా ప్రవర్తిస్తుంటారు. చెన్నైలో ఇలాంటి ఘటనే జరిగింది. భర్తపై అలిగిన భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. భార్యను తీసుకొచ్చేందుకు వెళ్లిన భర్త.. మద్యం మత్తులో అక్కడ చేసిన పనికి, అంతా షాక్ అయ్యారు. వివరాల్లోకి వెళితే...


చెన్నై పళ్లిపట్టు ఆర్‌.కే పేట సమీపం బాలాపురానికి చెందిన తమిళ్‌మణి(42) కి భార్య మంగళ, శరవణన్(14), ప్రతీప్(12) అనే కుమారులు ఉన్నారు. తమిళ్‌మణి తాపీ మేస్త్రీగా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుంటాడు. పెళ్లయిన చాలా ఏళ్లు వీరి సంసారం బాగానే సాగింది. అయితే ఇటీవల భర్త తాగుడుకు బానిసయ్యాడు. దీంతో వచ్చిన ఆదాయమంతా మందుకే ఖర్చు చేసేవాడు. ఇటీవల చాలా విషయాల్లో భార్యభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. భర్త ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో మంగళ పుట్టింటికి వెళ్లిపోయింది. అక్కడే టైలర్ షాప్ నిర్వహిస్తూ.. జీవనం సాగిస్తోంది.

భార్య అదృశ్యం.. కొన్ని రోజులకు భర్త తమ్ముడితో ప్రత్యక్షం.. చివరకు పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చి ప్రశ్నిస్తే..


కాపురానికి రావాలని తమిళ్‌మణి.. పలుమార్లు అత్తగారింటికి వెళ్లి పిలిచేవాడు. అయినా మంగళ మాత్రం కాపురానికి రానని చెబుతూ వచ్చేది. దీంతో తమళ్‌మణి రోజూ మరింత ఎక్కువగా మద్యం సేవించేవాడు. ఈ క్రమంలో సోమవారం ఫుల్‌గా మందు తాగి మళ్లీ అత్తగారి ఊరికి వెళ్లాడు. భార్య ఉంటున్న టైలర్ షాపు వద్దకు వెళ్లి.. ఇంటికి రావాల్సిందే అంటూ ఆమెతో గొడవపడ్డాడు. అయినా ఆమె అందుకు ఒప్పుకోలేదు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన భర్త.. కత్తితో ఆమెపై దాడి చేశాడు. తీవ్ర గాయాలవడంతో మంగళ.. అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు.. అక్కడికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది.

ఉద్యోగం చేసి స్థిరపడతాడునుకుంటే.. అందరికీ షాక్ ఇస్తూ.. ఆ బీటెక్ స్టూడెంట్ ఇలా చేస్తాడనుకోలేదు..

Updated Date - 2021-12-29T00:45:18+05:30 IST