ప్రజల ప్రాణాలతో వ్యాపారమేంటి?
ABN , First Publish Date - 2020-06-02T08:57:14+05:30 IST
మంత్రి అనుచరులు నాసిరకం శానిటైజర్లను, పీపీఈ కిట్లను తయారుచేసి విక్రయిస్తూ అధికార
మంత్రి వెలంపల్లికి ఎంపీ కేశినేని నాని ట్వీట్
విజయవాడ, జూన్ 1 (ఆంధ్రజ్యోతి) : మంత్రి అనుచరులు నాసిరకం శానిటైజర్లను, పీపీఈ కిట్లను తయారుచేసి విక్రయిస్తూ అధికార ముద్రతో ప్రభుత్వం నుంచి రూ.కోట్లలో కాజేసినట్లు ‘ఆంధ్రజ్యోతి’లో వచ్చిన కథనాన్ని ట్యాగ్ చేసి విజయవాడ ఎంపీ కేశినేని నాని సోమవారం ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘అమాత్యా.. వ్యాపారులను నిలువు దోపిడీ చేస్తున్నావు. దుర్గగుడిని మింగేస్తున్నావు. వినాయక గుడి ఆదాయం కాజేస్తున్నావు. ప్రజల ఆరోగ్యంతో ప్రాణాలతో కూడా వ్యాపారం ఏమిటి నాయనా? శవాల మీద కూడా పైసలు తీసుకునేలా ఉన్నావు.’ అని పేర్కొన్నారు.