AP News: ఫ్యామిలీ డాక్టర్ పథకం ఏమైంది? : అయ్యన్నపాత్రుడు
ABN , First Publish Date - 2022-08-17T02:33:48+05:30 IST
అనకాపల్లి: మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు సీఎం జగన్పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆగస్టు 15వ తేదీ నుంచి ప్రవేశపెడుతునట్టు సీఎం ప్రకటించిన ‘‘ఫ్యామిలీ డాక్టర్ పథకం’’ ఏమైందో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పథకం అమలుకు 3,500 మంది వైద్యులు అవసరం కాగా వారి
అనకాపల్లి: మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు (Ayyanna Patrudu) సీఎం జగన్ (CM Jagan)పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆగస్టు 15వ తేదీ నుంచి ప్రవేశపెడుతునట్టు సీఎం ప్రకటించిన ‘‘ఫ్యామిలీ డాక్టర్ పథకం’’ ఏమైందో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పథకం అమలుకు 3,500 మంది వైద్యులు అవసరం కాగా వారి జీతాలకే వందల కోట్లు ఖర్చవుతుంది. నిధులు లేకుండా పథకం ప్రవేశపెడతామని ఏ విధంగా ప్రకటించారో చెప్పాలన్నారు. ఇలాంటి పథకాలు ప్రవేశ చేయాలనుకున్నపుడు మేథావుల సలహాలు తీసుకుంటే బాగుంటుందని హితవు పలికారు. ‘సీఎం ఆరు లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చినట్టు సీఎం చెబుతున్నారు. వాలంటీరు ఉద్యోగాలేనా? ఇంకా ఏమైనా ఇచ్చారా? అని ప్రశ్నించారు.