చనిపోయే ఉద్దేశంతో వస్తే ఏం చేస్తాం?: యోగి

ABN , First Publish Date - 2020-02-20T09:34:25+05:30 IST

యూపీలో సీఏఏ ఆందోళనల్లో నిరసనకారులు పోలీసు కాల్పుల వల్ల చనిపోలేదని సీఎం యోగి ఆదిత్యనాథ్‌ చెప్పారు.

చనిపోయే ఉద్దేశంతో వస్తే ఏం చేస్తాం?: యోగి

లఖ్‌నవూ, ఫిబ్రవరి 19: యూపీలో సీఏఏ ఆందోళనల్లో నిరసనకారులు పోలీసు కాల్పుల వల్ల చనిపోలేదని సీఎం యోగి ఆదిత్యనాథ్‌ చెప్పారు. ఆందోళనకారులు వాళ్లకు వాళ్లే కాల్పులు జరుపుకొని చనిపోయారన్నారు. ‘‘యూపీలో అల్లర్లు లేవు. చనిపోవాలనే ఉద్దేశంతో ఎవరైనా వస్తే ఏం చేస్తాం? అతనెలా జీవిస్తాడు? పోలీసు కాల్పుల్లో ఎవరూ చనిపోలేదు’’ అని రాష్ట్ర అసెంబ్లీలో ప్రసంగించిన సందర్భంగా ఆయనీ వ్యాఖ్యలు చేశారు. 

Updated Date - 2020-02-20T09:34:25+05:30 IST