అనుమతిలేని పాఠశాలలపై చర్యలేవి?
ABN , First Publish Date - 2022-07-01T05:30:00+05:30 IST
అనుమతిలేని పాఠశాలలపై చర్యలేవి?
ఇబ్రహీంపట్నం, జూలై 1: అనుమతి లేకుండా నడుస్తున్న పాఠశాలలపై చట్టపరమైన చర్యలేవని ఏబీవీపీ నాయకులు ప్రశ్నించారు. ఇబ్రహీంపట్నంలో శుక్రవారం ఏబీవీపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ప్రైవేటు పాఠశాలల్లో ఫీజులు, పుస్తకాలు, స్టేషనరీ పేరుతో విచ్చలవిడిగా డబ్బులు వసూలు చేస్తున్నారని ఈదోపిడీని అరికట్టాని నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ గ్రేటర్ హైదరాబాద్ సంయుక్త కార్యదర్శి వంగ సంజీవరెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శశిధర్రెడ్డితోపాటు సందీప్, సాయిచంద్, మహేందర్, అనిల్ తదితరులున్నారు.