నేడు మెగా వ్యాక్సినేషన్‌

ABN , First Publish Date - 2021-09-17T05:29:53+05:30 IST

జిల్లావ్యాప్తంగా శుక్రవారం మెగా వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ నిర్వహిస్తున్నట్టు జిల్లా కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా ప్రక టించారు.

నేడు మెగా వ్యాక్సినేషన్‌

 కలెక్టర్‌ కార్తికేయ

ఏలూరు, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి): జిల్లావ్యాప్తంగా శుక్రవారం మెగా వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ నిర్వహిస్తున్నట్టు జిల్లా కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా ప్రక టించారు. దీనిని రికార్డు స్థాయిలో పూర్తి చేయాలని  అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన కలెక్టరేట్‌ నుంచి వీడియో సమీక్ష నిర్వహించి శుక్రవారం ఉదయం ఆరు గంటల నుంచి వ్యాక్సినేషన్‌ ప్రారంభించాలన్నారు. ఇప్పటికే గ్రామ, వార్డు సచివాలయాల వారీగా నోడల్‌ అధికారులను నియమిం చామన్నారు. 18 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరికీ మొదటి డోసును మెగా వ్యాక్సిన్‌ డ్రైవ్‌లో ఇప్పించాలన్నారు. నూరు శాతం వ్యాక్సినేషన్‌ చేసి రాష్ట్రంలోనే అత్యధిక వ్యాక్సినేషన్‌ నిర్వహించిన జిల్లాగా నమోదు చేయాలని స్పష్టం చేశారు. వీసీలో జేసీ బీఆర్‌ అంబేడ్కర్‌, హిమాన్షుశుక్లా, వి.పద్మావతి, డీఆర్వో డేవిడ్‌ రాజు, డీఎంహెచ్‌వో రవి, డీపీవో రమేశ్‌కుమార్‌ అధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-09-17T05:29:53+05:30 IST