పొంచి ఉన్న ప్రమాదం
ABN , First Publish Date - 2021-12-06T04:36:37+05:30 IST
పవరుపేట స్టేషన్ రోడ్డు నుంచి డీఎం హెచ్వో కార్యాలయానికి వెళ్లే రహదారిలో మార్జిన్లోని విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ వద్ద ప్రమాదం పొంచి ఉందని స్థానికులు భయాందోళ నలు వ్యక్తం చేస్తున్నారు.
ఏలూరు కార్పొరేషన్, డిసెంబరు 5: పవరుపేట స్టేషన్ రోడ్డు నుంచి డీఎం హెచ్వో కార్యాలయానికి వెళ్లే రహదారిలో మార్జిన్లోని విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ వద్ద ప్రమాదం పొంచి ఉందని స్థానికులు భయాందోళ నలు వ్యక్తం చేస్తున్నారు. దీనికి రక్షణ ఏర్పాట్లు లేవని, చిన్న పిల్లలకు సైతం అందేలా ట్రాన్స్ఫార్మర్ వైర్లు ఉన్నాయని, ఈ ప్రాంతం లోనే ఎక్కువగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయని, ఇటువంటి రద్దీ ప్రాంతంలో రోడ్డు మార్జిన్లోనే ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయడం ప్రమా దకరమని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు రక్షిత ప్రాంతానికి తరలించడం లేదా ట్రాన్స్ఫార్మర్కు నాలుగు వైపులా రక్షణ గోడలు నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు.