క్షత్రియుల అభ్యున్నతికే కార్పొరేషన్‌

ABN , First Publish Date - 2021-08-14T06:15:28+05:30 IST

క్షత్రియుల్లో ఉన్న పేదవారి అభ్యున్నతికే ప్రత్యేకంగా కార్పొరేషన్‌ ఏర్పాటు చేశామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్‌ అన్నారు.

క్షత్రియుల అభ్యున్నతికే కార్పొరేషన్‌
క్షత్రియ కార్పొరేషన్‌ చైర్మన్‌ సర్రాజును గజమాలతో సత్కరిస్తున్న మంత్రులు, ఎమ్మెల్యేలు

సర్రాజు ప్రమాణ స్వీకారోత్సవంలో మంత్రి ధర్మాన

కాళ్ళ, ఆగస్టు 13 : క్షత్రియుల్లో ఉన్న పేదవారి అభ్యున్నతికే ప్రత్యేకంగా కార్పొరేషన్‌ ఏర్పాటు చేశామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్‌ అన్నారు. కాళ్ళ మండలం పెదఅమిరం రాధాకృష్ణ కన్వెన్షన్‌ కల్యాణ మండపంలో శుక్రవారం రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్‌ చైర్మన్‌ పాతపాటి సర్రాజు ప్రమాణ స్వీకారోత్సవ సభలో ఆయన మాట్లాడారు. అగ్రవర్ణ పేదలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న పేద క్షత్రియులు అభివృద్ధి సాధించాలన్నారు. తొలుత కాళ్ళకూరు వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస్‌ వేణుగోపాలకృష్ణ సర్రాజుతో ప్రమాణ స్వీకా రం చేయించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఆళ్ల నాని, చెరుకువాడ శ్రీరంగనాథరాజు, పినిపే విశ్వరూప్‌, ఎమ్మెల్యేలు గ్రంధి శ్రీనివాస్‌, ముదునూరి ప్రసాదరాజు, కొఠారి అబ్బయ్య చౌదరి, కొట్టు సత్యనారాయణ, జి.శ్రీని వాస్‌ నాయుడు, తలారి వెంకట్రావు, ఎమ్మెల్సీలు కొయ్యే మోషేన్‌రాజు, పెన్మెత్స సూర్యనారాయణరాజు, డీసీసీబీ చైర్మన్‌ పీవీఎల్‌ నరసింహరాజు, డీసీఎంఎస్‌ చైర్మన్‌ వేండ్ర వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.   

Updated Date - 2021-08-14T06:15:28+05:30 IST