శ్రీ వారి శ్రీ పుష్ప యాగం
ABN , First Publish Date - 2022-05-19T05:52:27+05:30 IST
కాళ్ళకూరు వేంకటేశ్వరస్వామి తిరుకల్యాణోత్సవాలు ముగిశాయి.
కాళ్ళ, మే 18 : కాళ్ళకూరు వేంకటేశ్వరస్వామి తిరుకల్యాణోత్సవాలు ముగిశాయి. చివరి రోజైన బుధవారం రాత్రి స్వామి అమ్మవార్లకు ఆలయ ద్వాదశ ప్రదక్షిణలు, విష్వక్సేనపూజ, పుణ్యహవచనం, చక్రాబ్ది మండలార్చన చేపట్టారు. 12 రకాల విశేష ప్రసాదాలు ఆరగింపు, శ్రీ పుష్ప యాగ ఉత్సవం (పవళింపు సేవ), నీరాజన మంత్ర పుష్ప ప్రసాద వినియోగం జరిగాయి. ఈ నెల 21 శనివారం అన్నసమారాధన జరగనుంది.