జగన్నాథపురంలో భూ వివాదం

ABN , First Publish Date - 2021-05-06T05:07:27+05:30 IST

అంకన్నగూడెం పంచాయతీ శివారు జగన్నాఽథపురంలో 98 ఎకరాల్లో మామిడితోట విషయమైవివాదం నెలకొంది.

జగన్నాథపురంలో భూ వివాదం
మామిడితోట యజమానులకు రక్షణ కల్పించేందుకు వచ్చిన పోలీస్‌ సిబ్బంది

పోలీస్‌ బలగాల మధ్య మామిడి కాయ కోత

జీలుగుమిల్లి, మే 5: అంకన్నగూడెం పంచాయతీ శివారు జగన్నాఽథపురంలో 98 ఎకరాల్లో మామిడితోట విషయమైవివాదం నెలకొంది. దిబ్బగూడెం, అంకన్నగూడెం, జగన్నాఽథపురం గ్రామాల గిరిజనులు కొందరు గిరిజనేతరుల మధ్య జగన్నాథ పురం లో మామిడి తోటకు సంబంధించి ఏటా మామిడి కాయలు కోసే క్రమంలో వివాదం జరుగుతోంది. బుధవారం కొందరు గిరిజన మహిళలు మామిడి కాయల కోతను అడ్డుకునే ప్రయత్నం చేశారు. అప్పటికే మోహరించిన పోలవరం సీఐ ఎ.నవీన్‌ నరసింహమూర్తి జీలుగుమిల్లి, బుట్టాయగూడెం, పోలవరం ఎస్సైలు కె.విశ్వనాథబాబు, ఆర్‌.శ్రీను, ఎం.వెంకటేశ్వరావు గిరిజన మహిళలకు నచ్చ చెప్పారు. సమస్యను రెవెన్యూ అధికారుల సమక్షంలో పరిష్కరించుకోవాలని సీఐ మహిళలకు సూచించారు. అనంతరం పోలీస్‌ బందోబస్తు నడుమ మామిడి కాయల కోతను కొనసాగించారు. సాయంత్రం వరకు పోలవరం సబ్‌ డివిజన్‌ పరిధిలో నాల్గు పోలీస్‌స్టేషన్‌ల కానిస్టేబుళ్లు,  ఏఎన్‌ఎస్‌ పార్టీ సిబ్బంది గస్తీ నిర్వహించారు.


Updated Date - 2021-05-06T05:07:27+05:30 IST