మానవత్వం చాటిన పంచాయతీ సభ్యులు
ABN , First Publish Date - 2021-05-17T05:13:11+05:30 IST
మొగల్తూరు పంచాయతీ పరిధి గరువుపల్లవపాలెం గ్రామానికి చెందిన తిరుమాని మీరమ్మ (85) గతరాత్రి కరోనాతో మృతి చెందింది.
మొగల్తూరు, మే 16: మొగల్తూరు పంచాయతీ పరిధి గరువుపల్లవపాలెం గ్రామానికి చెందిన తిరుమాని మీరమ్మ (85) గతరాత్రి కరోనాతో మృతి చెందింది. ఆమె భర్త గతంలోనే మృతి చెందగా ఆమె ఇద్దరు కుమారులు గ్రామంలోనే నివాసం ఉంటున్నారు. అయితే మృతురాలు కృష్ణా జిల్లా కొండంగి గ్రామంలో నివాసముంటున్న కుమార్తె దగ్గర ఉంటూ రెండు రోజుల క్రితం గ్రామానికి వచ్చింది. అనారోగ్య లక్షణాలు కనపడటంతో కుటుంబ సభ్యులు అసుపత్రిలో కరోనా పరిక్ష చేయించగా పాజిటివ్ అని తేలడంతో ఇంటికి తీసు కువచ్చేశారు. శనివారం రాత్రి మృతి చెందింది. ఆదివారం మృతదేహన్ని ఖననం చేసేందుకు ఎవరూ రాలేదు. దీంతో పంచాయతీ పాలకవర్గ సభ్యులు ముందుకు వచ్చి కుమారులతో పాటు మరో ఇద్దరికి పీపీఈ కిట్లు అందించి దగ్గరుండి ఖననం చేయించారు. సర్పంచ్ పడవల మేరీ సత్యనారాయణ, ఉప సర్పంచ్ బోణం నర్సింహరావు, వార్డు సభ్యులు కర్రి సూర్యనారాయణ, కడలి త్రిమూ ర్తులు, పొన్నపల్లి మోహన్ పాల్గొన్నారు.