నేడు వడ్డిగూడెంలో అమృత్‌ సరోవర్‌ ప్రారంభం

ABN , First Publish Date - 2022-08-14T04:54:57+05:30 IST

అజాదీ కా అమృత్‌ మహోత్సవంలో భాగంగా అమృత్‌ సరోవర్‌ పథకం కింద ఎంపిక చేసిన వడ్డిగూడెం చెరువు అభివృద్ధి పనులు ఉపాధి హామీ పఽథకంలో పూర్తయ్యాయి.

నేడు వడ్డిగూడెంలో అమృత్‌ సరోవర్‌ ప్రారంభం

వీరవాసరం, ఆగస్టు 13: అజాదీ కా అమృత్‌ మహోత్సవంలో భాగంగా  అమృత్‌ సరోవర్‌ పథకం కింద ఎంపిక చేసిన వడ్డిగూడెం చెరువు అభివృద్ధి పనులు  ఉపాధి హామీ పఽథకంలో పూర్తయ్యాయి. ఆదివారం జిల్లా కలెక్టర్‌ పి.ప్రశాంతి చెరువుకు హారతులు ఇచ్చి ప్రారంభించనున్నారని సర్పంచ్‌ సైదు శ్రీనివాసరావు శనివారం తెలిపారు. దాతల సహకారంతో వాకింగ్‌ ట్రాక్‌, సుందరీకరణ పనులు చేపట్టనున్నారు. జిల్లాలో మొత్తం 75 చెరువులను అమృత్‌ సరోవర్‌ పథకం కింద ఎంపిక చేశారు. 

Updated Date - 2022-08-14T04:54:57+05:30 IST