ఏలూరు సెకండ్ ఏజేసీజే కోర్టు జడ్జిగా ప్రమీలారాణి
ABN , First Publish Date - 2021-07-25T05:34:01+05:30 IST
ఏలూరులో ఉన్న రెండవ అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు (జువైనల్కోర్టు) జడ్జిగా ఎం ప్రమీలారాణిని నియమిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
ఏలూరు క్రైం, జూలై 24 : ఏలూరులో ఉన్న రెండవ అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు (జువైనల్కోర్టు) జడ్జిగా ఎం ప్రమీలారాణిని నియమిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో 62 మంది న్యాయమూర్తులను హైకోర్టు బదిలీ చేసింది. ఏలూరులోని రెండవ అదనపు జూనియర్ సివిల్ జడ్జి (జువైనల్ కోర్టు)గా పనిచేస్తున్న ఎం.సుధారాణిని తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం అదనపు జూనియర్ సివిల్ జడ్జిగా బదిలీ చేశారు. విశాఖపట్టం జిల్లా భీమిలిపట్టణం మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జిగా పని చేస్తున్న ఎం.ప్రమీలా రాణిని ఏలూరు సెకండ్ ఏజేసీజే కోర్టుకు జడ్జిగా నియమించారు.