బెంగాల్ ఘటనపై బీజేపీ నేతల నిరసనలు
ABN , First Publish Date - 2021-05-06T06:22:17+05:30 IST
పశ్చిమబెంగాల్లో హిందు వులు, బీజేపీ కార్యకర్తలపై తృణమూల్ కాంగ్రెస్ కార్య కర్తలు చేసిన హింసాత్మక ఘటనలను నిరసిస్తూ బీజేపీ నాయకులు ఇళ్ల వద్దే దీక్షలు చేపట్టారు.
అమలాపురం టౌన్, మే 5: పశ్చిమబెంగాల్లో హిందు వులు, బీజేపీ కార్యకర్తలపై తృణమూల్ కాంగ్రెస్ కార్య కర్తలు చేసిన హింసాత్మక ఘటనలను నిరసిస్తూ బీజేపీ నాయకులు ఇళ్ల వద్దే దీక్షలు చేపట్టారు. రాజోలులో మాజీ ఎమ్మెల్యే మానేపల్లి అయ్యాజీవేమా, అమలాపు రంలో పార్టీ ప్రధాన కార్యదర్శి మోకా వెంకటసుబ్బా రావు, పార్టీ సీనియర్ నాయకుడు పెయ్యల శ్యాం ప్రసాద్లు కుటుంబ సమేతంగా నిరసన దీక్షలో పాల్గొ న్నారు. దాడులకు పాల్పడిన దోషులను కఠినంగా శిక్షిం చడంతో పాటు సీఎం మమతా బెనర్జీపై చర్యలు తీసు కోవాలని వారు డిమాండు చేశారు.
మామిడికుదురు: పశ్చిమబెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుందని బీజేపీ మండల అధ్యక్షుడు మెండా ఆదినారాయణ ఆరోపిం చారు. తృణమూల్ కాంగ్రెస్ చేస్తున్న అరాచకాలను నిరి సస్తూ బుధవారం బీజేపీ నాయకులు నిరసన కార్యక్ర మం చేపట్టారు. బీజేపీ కార్యకర్తలు, మహిళలపై టీఎంసీ కార్యకర్తలు దౌర్జన్యానికి పాల్పడుతున్నారని అన్నారు.